కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి ఈటల

by Shyam |

<p>తెలంగాణ ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రభు్త్వం విధించిన లాక్‌డౌన్‌కు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో నమోదయ్యే కరోనా కేసులను పరీక్షించేందుకు ఈఎస్ఐ హాస్పిటల్‌లో ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు.అంతేకాకుండా ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి అందరూ కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అవసరమైతే వైద్య విద్యార్థులు, జూడాల సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ఇతర రంగాల వారిని కూడా ఇందులో [&hellip;]</p>

కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి ఈటల
X

తెలంగాణ ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రభు్త్వం విధించిన లాక్‌డౌన్‌కు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో నమోదయ్యే కరోనా కేసులను పరీక్షించేందుకు ఈఎస్ఐ హాస్పిటల్‌లో ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు.అంతేకాకుండా ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి అందరూ కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అవసరమైతే వైద్య విద్యార్థులు, జూడాల సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ఇతర రంగాల వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తామన్నారు.దయచేసి తెలంగాణ ప్రజలు ప్రభుత్వానిక సహకరించాలని, అత్యవసరం అయితే తప్ప మిగతా సమయాల్లో బయటకు రాకూడదని విన్నవించారు.

Tags: minsiter etala rajender, carona, lock down, esi, medical syudents

Next Story