చెరువులో స్నానానికి వెళ్లిన మైనర్.. రిస్క్ తీసుకున్న పోలీసులు

by  |
చెరువులో స్నానానికి వెళ్లిన మైనర్.. రిస్క్ తీసుకున్న పోలీసులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : స్నేహితులతో చెరువులో స్నానానికి వెళ్లి మైనర్ గల్లంతైన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు రిస్క్ తీసుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. సౌత్ రూరల్ సీఐ రవి కథనం ప్రకారం.. మల్లారం ఎఫ్‌సీఐ గోదాం వద్ద ఉన్న చెరువులో శివాజినగర్‌కు చెందిన ముగ్గురు స్నేహితులు స్నానానికి వెళ్లారు. అందులో లోకేష్ గల్లంతుకావడంతో స్థానికులు జిల్లా రూరల్ పోలీస్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రెస్క్యూటీం సహాయంతో వెతకడం ప్రారంభించాయి. శనివారం రాత్రివరకు గాలించిన లోకేష్ మృతదేహా దొరకకపోవడంతో ఆదివారం ఉదయాన్నే వెతకగా గంటన్నర తర్వాత తీటౌన్ కానిస్టేబుల్ ఆఫ్సర్ డెడ్ బాడీ వెలికి తీశాడు. ఈ రెస్క్యూటీంలో త్రీటౌన్ కానిస్టేబుల్ ఎండి అఫ్సర్ , ఫిఫ్త్ టౌన్ కానిస్టేబుల్ సురేష్, పోలీస్ అకాడమీ హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ పాల్గొన్నారు. లోకేష్ డెడ్ బాడీ పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed