- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్ : రోజురోజుకి సమాజంలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆడపిల్లను బయటికి పంపాలంటే భయపడుతున్న తల్లిదండ్రులు ఈ ఘటనతో కనీసం బంధువుల ఇంట్లోకి కూడా పంపారు. అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులపై నీచాతినీచంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే భోపాల్ లో చోటు చేసుకుంది. కోలార్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ మైనర్ బాలికపై తన మేనమామ, తాత అత్యాచారానికి పాల్పడ్డారు. గత వారం రోజుల క్రితం జరిగిన ఈ దారుణ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
సమోసా ఇప్పిస్తానని ఓ మైనర్ బాలికను తన మూడేళ్ళ తమ్ముడుతో సహా మేనమామ బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆ ఇంట్లో ఉన్న తాత, మేనమామ కలిసి ఆ చిన్నారిపై మూడేళ్ళ తమ్ముడు ముందే అత్యాచారానికి ఒడిగట్టారు. బాలికకు రక్త స్రావం కావడంతో, తమ్ముడికి, బాలికకు సమోసా కొనిచ్చి, రూ.20 లు చేతిలో పెట్టి ఇంటి మూడు వదిలిపెట్టారు. ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదని బెదిరించడంతో ఆ చిన్నారి నొప్పిని భరించి చెప్పలేదు. అయితే కొన్ని రోజులుగా బాలికను గమనించిన ఆమె తల్లి అడగడంతో, బాలిక తను అనుభవించిన నరకయాతనను తల్లికి చెప్పేసింది. ఈ విషయంపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మేనమామ, తాతను అరెస్ట్ చేశారు.