బాలికకు చిత్రహింసలు..

by  |
బాలికకు చిత్రహింసలు..
X

దిశ, వెబ్‌డెస్క్ :కరీంనగర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. రాజశేఖర్ రెడ్డి అనే ఇంటి యాజమాని తన తండ్రిని చూసుకోవడానికి ఓ బాలికను పనిలో పెట్టుకున్నాడు. ఆమెను రెండేళ్ల కిందట హైదరాబాద్ నుంచి చొప్పదండికి తీసుకొచ్చాడు. అయితే, బాలిక పని సరిగా చేయడం లేదంటూ రోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు.

ఈ విషయాన్ని బాధితురాలు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు వెంటనే ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు ఇంటి యాజమానిపై విచారణ చేపట్టారు. మైనర్‌ను పనిలో పెట్టుకోవడంతో పాటు చిత్రహింసలకు గురిచేస్తున్నది నిజమే అని తేలడంతో సదరు యాజమానిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.



Next Story