- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :కరీంనగర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. రాజశేఖర్ రెడ్డి అనే ఇంటి యాజమాని తన తండ్రిని చూసుకోవడానికి ఓ బాలికను పనిలో పెట్టుకున్నాడు. ఆమెను రెండేళ్ల కిందట హైదరాబాద్ నుంచి చొప్పదండికి తీసుకొచ్చాడు. అయితే, బాలిక పని సరిగా చేయడం లేదంటూ రోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు.
ఈ విషయాన్ని బాధితురాలు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు వెంటనే ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు ఇంటి యాజమానిపై విచారణ చేపట్టారు. మైనర్ను పనిలో పెట్టుకోవడంతో పాటు చిత్రహింసలకు గురిచేస్తున్నది నిజమే అని తేలడంతో సదరు యాజమానిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
Next Story