మర్రిమిట్ట రోడ్డు ప్రమాదంపై మంత్రులు దిగ్భ్రాంతి

by  |
మర్రిమిట్ట రోడ్డు ప్రమాదంపై మంత్రులు దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో లారీని ఆటో ఢీ కొని ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గూడూరు మండలం మర్రిమిట్టలో శుక్రవారం చోటుచేసుకుంది. తాజాగా దీనిపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ స్పందించారు. రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేగాకుండా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.



Next Story

Most Viewed