- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: రాష్ట్రంలో తొలి కరోనా( కోవిడ్-19) పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ అనుమానిత బాధితుల సహాయార్థం ప్రత్యేక హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా 24 గంటల పాటు నడిచే కాల్ సెంటర్ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో విస్తృతంగా కరోనా వైరస్ పట్ల ప్రజలను చైతన్యం చేసేలా ప్రచారం నిర్వహించాలని సమాచార ప్రజా సంబంధాల శాఖను ఆదేశించారు. కరోనా వైరస్పై వందంతులు ప్రచారం చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Story