పారిశుద్ధ్య కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలి

by  |
పారిశుద్ధ్య కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలి
X

దిశ, మెదక్: చేగుంటలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి వెళ్తున్న మంత్రి హరీష్ రావు మార్గం మధ్యలో పారిశుద్ధ్య కార్మికులను చూసి కారు దిగి వారితో మాట్లాడాడు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు తప్పక వాడాలని చెప్పారు.సమాజం కోసం పారిశుద్ధ్య కార్మికులు కృషి చేస్తున్నారని అన్నారు.
కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను మంత్రి అందించారు. హరీష్ రావు వెంట దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఉన్నారు.

Tags: minister harish rao, spoke, sanitation workers, medak

Next Story

Most Viewed