‘ప్రశాంత ప్రదేశంలో… అశాంతిని సృష్టించే కుట్ర’

by  |
‘ప్రశాంత ప్రదేశంలో… అశాంతిని సృష్టించే కుట్ర’
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్వేది ఘటన జరగ్గానే ప్రభుత్వం వెంటనే స్పందించిందని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన ఓ మీడియా డిబెట్‌లో పాల్గొని మాట్లాడారు. నిరసనలో చర్చి మీద రాళ్లు వేసిన వారినే పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. అంతేగాకుండా విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలతో మాట్లాడామని వెల్లడించారు.

తెలుగుదేశం పార్టీకి సీబీఐ ఎంక్వయిరీ అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు. గతంలో సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించబోమన్న విషయం టీడీపీ మర్చిపోయిందా అని విమర్శించారు. తమ చిత్తశుద్ధిని చాటుకునేందుకే అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించామని అన్నారు. ప్రశాంత ప్రదేశంలో అశాంతిని సృష్టించే కుట్ర జరినట్టు అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

Next Story