ప్రాణభయంతో ఆర్ఆర్ఆర్ ఢిల్లీలో ఉన్నాడు: మంత్రి

by  |
ప్రాణభయంతో ఆర్ఆర్ఆర్ ఢిల్లీలో ఉన్నాడు: మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: గతకొన్నాళ్ల నుంచి ఎంపీ రఘురామ కృష్ణంరాజు, వైసీపీ నేతల మధ్య గత కొద్ది రోజుల నుంచి రాజకీయ యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరోసారి ఫైరయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రఘురామకృష్ణంరాజు నీచమైన ఆరోపణలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ను ఒక్క కులానికే పరిమితం చేయాలని చంద్రబాబు, రఘురామరామకృష్ణ కుట్ర చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. 5 నెలలుగా రఘురామకృష్ణంరాజు ప్రాణభయంతో ఢిల్లీలోనే ఉన్నారని మంత్రి వెల్లంపల్లి అన్నారు.

Next Story

Most Viewed