మంత్రిని అడ్డుకున్న దళిత సంఘాలు

by  |
మంత్రిని అడ్డుకున్న దళిత సంఘాలు
X

దిశ, వెబ్ డెస్క్: దళితుడిని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి తానేటి వనితకు చేదు అనుభవం ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం పోలీస్ స్టేషన్‌లో శిరోముండనానికి గురైన ప్రసాద్ అనే దళిత యువకుడు రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని పరామర్శించేందుకు వచ్చిన వనితను దళిత సంఘాలు అడ్డుకున్నాయి. మంత్రితో పాటు జక్కంపూడి రాజా, మేరుగ నాగార్జున కూడా ఉన్నారు.

దళిత యువకుడికి శిరోముండనం చేస్తే ప్రభుత్వం ఏం చేస్తోందని దళిత సంఘాల నేతలు ఆగ్రహించారు. ఘటనకు కారణమైన వైసీపీ నేతను అరెస్ట్ చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని మంత్రిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టి మంత్రిని రూట్ క్లియర్ చేశారు.

Next Story

Most Viewed