వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు : తలసాని

by  |
వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు : తలసాని
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: ప్ర‌పంచ దేశాల‌కు క‌రోనా వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేయ‌డంలో హైద‌రాబాద్ ప్ర‌ధాన భూమిక‌గా నిలుస్తుంద‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. ఈ మేర‌కు సోమ‌వారం హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో క‌రోనా వ్యాక్సిన్‌పై స‌మీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ… వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు, వదంతులు నమ్మరాదని సూచించారు. కరోనా వ్యాక్సిన్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చే వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు.

వ్యాక్సిన్ తీసుకునే సమయంలో అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, త్వరలోనే దీనిపై అందరికీ సదాభిప్రాయం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజలకు దీనిపై అవగాహన కల్పించేందుకు, భయాన్ని పోగొట్టేందుకు ప్రతిరోజూ వ్యాక్సిన్‌పై అందరికీ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ… కరోనా సమయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు ఎంతో రిస్క్ తీసుకుని సేవ చేశారని అన్నారు. పోలీసులకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed