అక్రమ నిర్మాణాలను తొలగించండి

by  |
అక్రమ నిర్మాణాలను తొలగించండి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం బేగంబజార్‌లోని పాత పోలీస్ స్టేషన్ వద్ద 2.25 కోట్ల వ్యయంతో స్టీల్ గైడర్ వంతెన పనులను ఆయన తనిఖీ చేశారు. నాలా వంతెన నిర్మాణం పూర్తయితే సమస్యలు తొలగిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శంకర్ యాదవ్, పరమేశ్వరి సింగ్, జోనల్ కమిషనర్ ప్రావిణ్య, హెచ్ఆర్డీ ఎస్ఈ రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed