మొబైల్ ఫిష్ జౌట్‌లెట్ వాహనాల పరిశీలన

by  |
మొబైల్ ఫిష్ జౌట్‌లెట్ వాహనాల పరిశీలన
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రజల చెంతకే పలు రకాల చేపలను తీసుకువెళ్లి విక్రయించాలనే లక్ష్యంతో మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సైఫాబాద్‌లోని అరణ్య భవన్‌లో మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను ఆర్థిక మంత్రి హరీష్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల డిజైన్ల గురించి మంత్రి తలసాని ఇతర మంత్రులకు వివరించారు. మహానగర పాలక సంస్థ పరిధిలో డివిజన్‌కు ఒకటి చొప్పున 150 వాహనాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తలసాని వెల్లడించారు.


Next Story

Most Viewed