ఆ కొండను చూస్తూ పెరిగా : సుచరిత

by  |
ఆ కొండను చూస్తూ పెరిగా : సుచరిత
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా కొండవీడు కోట అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సుచరిత అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా కొండవీడును అభివృద్ధి చేస్తామని అన్నారు. అయతే ప్రస్తుత రోజుల్లో చరిత్రను తెలుసుకోవాలన్న ఆసక్తి, నేటి యువతలో తగ్గుతుందని తెలిపారు.

పురాతన ఆలయాలను, చారిత్రక కట్టడాలను అభివృద్ధి చేయడం మూలంగా కొంతమేర చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారని అన్నారు. తన చిన్ననాటి నుంచి కొండవీటి కొండను చూస్తు పెరిగానని వెల్లడించింది. అప్పట్లో కొండపైకి వెళ్లడానికి సరైన దారి ఉండేది కాదని గుర్తు చేసుకున్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణానికి శివారెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు.



Next Story