సహకారం మరువలేనిది.. చిరుపై మంత్రి ప్రశంసలు

by  |
సహకారం మరువలేనిది..  చిరుపై మంత్రి ప్రశంసలు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోనా విపత్కర సమయంలో ఏర్పడ్డ ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ప్రముఖ సినీ హీరో చిరంజీవి ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అనాధాశ్రమంలో చిరంజీవి అభిమానులు మొదటి విడతగా తీసుకొచ్చిన పది ఆక్సిజన్ సిలిండర్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సినీ రంగంలో మెగాస్టార్ గా వెలుగొందిన చిరంజీవి.. బ్లడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలు నిలిపారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సిలిండర్ లను అందజేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

మరో నలభై సిలిండర్లను చిరంజీవి గారు త్వరలోనే జిల్లాకు పంపనున్నారని మంత్రి చెప్పారు. ఇటువంటి విపత్కర పరిస్థితులను దాతలు ముందుకు రావడానికి ఈ కార్యక్రమం స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు. సమస్యలన్నింటినీ అధిగమించి మహబూబ్ నగర్ లో హైదరాబాద్ కార్పోరేట్ ఆస్పత్రులకు దీటుగా, తక్కువ బిల్లులతో వైద్యం అందిస్తున్నారన్నారు. ఈ కారణంగా హైదరాబాద్ నుండి సైతం ఇక్కడే ఆసుపత్రిలో చేరి వైద్యం పొందుతున్నారన్నారు. నిరంతరం శ్రమించే వారిని ఇబ్బందులకు గురి చేయకూడదని, ఏవైనా సలహాలు సూచనలు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed