‘‘మోకు దెబ్బ సదస్సుకు రండి’’

by  |
‘‘మోకు దెబ్బ సదస్సుకు రండి’’
X

హైదరాబాద్ రవీంద్రభారతిలో మార్చి రెండో తేదీన నిర్వహించే తెలంగాణ గీత కార్మికుల మోకు దెబ్బ సదస్సుకు రావాలని రాష్ర్ట ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను సంఘం నాయకులు కోరారు. మంత్రిని కలిసిన వారిలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర వేణి నర్సాగౌడ్ పాల్గొన్నారు. ఈ మేరకు బుధవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి సభ్యులు గంగాధర్ గౌడ్, బీసీ సంక్షేమ ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం గౌడ్ తదితరులను కలిసి సదస్సుకు రావాలని కోరారు. రాష్ట్రంలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు, హైదరాబాదులో ప్రారంభించిన నీరా పాలసీని రాష్ట్రమంతా విస్తరించాలని, ఏజెన్సీలో గౌడ కులస్తులను ఎస్టీలుగా గుర్తించాలని కోరారు. అలాగే పలు సంక్షేమ డిమాండ్లతో నిర్వహిస్తున్న ఈ మోకు దెబ్బ సదస్సును జయప్రదం చేయాలని నర్సాగౌడ్ కోరారు.

షూటింగ్‌లో గాయపడిన హీరో అజిత్

Next Story

Most Viewed