- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత 100 కరోనా బెడ్లను కేటాయించారు. ఈ మేరకు ఈ విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ట్విట్టర్ ద్వారా కవిత సమాచారం అందజేశారు. వలస కూలీలు, కరోనా పేషెంట్లకు సిన్జెంటా ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ఆసుపత్రులకు 100 కరోనా బెడ్లను కేటాయిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ పెట్టెను కల్వకుర్తి, జడ్చర్ల, బాలానగర్ పీహెచ్సీలకు, అచ్చంపేట, కోయిలకొండ, మద్దూరు, కొల్లాపూర్, వీపనగండ్ల పీహెచ్సీలో ఏర్పాటు చేసే విధంగా బెడ్లను కేటాయించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 100 కరోనా బెడ్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.