మంత్రి ఆకస్మిక పర్యటన

by  |
మంత్రి ఆకస్మిక పర్యటన
X

దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా పర్యటించారు. సోమవారం సాయంత్రం ఆయన మెట్టుగడ్డ వద్ద నిర్మిస్తున్న వెజ్-నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా బస్ స్టాప్ వద్ద పండ్లు అమ్ముకునే వారికోసం నిర్మిస్తున్న స్ట్రీట్ వెండర్ షాప్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన స్ట్రీట్ వెండోర్స్‌తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

tag: minister, srinivas goud, sudden visit, Mahbubnagar

Next Story

Most Viewed