ఆకుపచ్చ తెలంగాణ దిశగా అడుగులు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

by  |
ఆకుపచ్చ తెలంగాణ దిశగా అడుగులు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
X

దిశ, మహబూబ్‎నగర్: ప్రస్తుతం ఆకుపచ్చ తెలంగాణ సాధించే దిశగా అడుగులు పడుతున్నాయని, ఇందుకోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకులను నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ జెండాను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనాథ బాల, బాలికల వసతి గృహంలో పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. పిల్లలతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్యారంబోర్డ్ ఆడారు.

tag: Minister Srinivas Goud, Participated, TRS Formation day celebrations, mahabubnagar



Next Story

Most Viewed