హైదరాబాద్‌ను అంబానీకి అమ్మేస్తారు : శ్రీనివాస్ గౌడ్

by  |
హైదరాబాద్‌ను అంబానీకి అమ్మేస్తారు : శ్రీనివాస్ గౌడ్
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార పార్టీకి చెందిన నేతలు బీజేపీయే టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. అటు బీజేపీ కూడా టీఆర్‌ఎస్ నేతల అక్రమాలు, వారు చేసిన అభివృద్ధి తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్దికి చేసింది శూన్యమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్రంపై చార్జీషీట్ వేయాలన్నారు. హైదరాబాద్ మహానగరంలో అల్లర్లు సృష్టించడమే బీజేపీ ప్రధాన ఎజెండా అని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ ను బీజేపీకి ఇస్తే అంబానీకి అమ్మేస్తారని వివరించారు.



Next Story

Most Viewed