ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలి: శ్రీనివాస్ గౌడ్ 

by  |

దిశ, మహబూబ్‌నగర్: ప్రజలు ఎవరు బయటకు రాకుండా ఇంట్లో ఉండటం ద్వారా కరోనా నియంత్రణ సాధ్యం అవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మందిని గుర్తించిన అధికారులు వారికి కరోనా వైరస్ టెస్టులు నిర్వహించారు. టెస్టుల్లో నెగెటివ్ రావడంతో హోమ్ క్వారంటైన్ చేసి, ప్రత్యేక వాహనంలో వారి వారి ఇండ్లకు పంపడం జరిగింది. కొన్ని రోజుల వరకు బయటకు రాకుండా ఇంటికే పరిమితం కావాలని మంత్రి సూచించారు. హుమ్ క్వారంటైన్‌లో ఉన్నవారికి నిత్యావసర సరుకులను ఇంటికే పంపిణీ చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

Tags: srinivas goud, comments, corona suspects, home quarantine, mahabubnagar

Next Story

Most Viewed