- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, మహబుబ్నగర్: కరోనాతో మృతిచెందిన వారి అంతిమ సంస్కారాలకు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాకపోవడం హేయమైన చర్య అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమ సంస్కారాలు నిర్వహించినంత మాత్రాన కరోనా అంటుకోదని స్పష్టం చేశారు. గాంధీ తదితర ఆస్పత్రుల్లో కరోనాతో మృతిచెందిన వారిని వారి కుటుంబ సభ్యులే తీసుకువెళ్లడానికి ముందుకు రాకపోవడం, మనుషుల్లో మానవత్వం చనిపోయిందనడానికి నిదర్శనం అన్నారు.
కోవిడ్ నిబంధనల ప్రకారం.. పీపీఈ కిట్లు వేసుకొని అంత్యక్రియల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ సందేశాన్ని అందరికీ చేరవేయాలన్న ఉద్దేశంతోనే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఓ ప్రముఖుడి అంత్యక్రియలకు హాజరైనట్టు తెలిపారు. కరోనాతో చనిపోయిన తల్లిదండ్రుల్ని తీసుకువెళ్లడానికి ముందుకు రాని వారి జన్మ వృథా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అపోహలు వీడి ఆప్తులకు అంత్యక్రియలు నిర్వహించాలని మంత్రి సూచించారు.