కేంద్రం కొనకపోతే ఉద్యమిస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

by  |
కేంద్రం కొనకపోతే ఉద్యమిస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్
X

దిశ, మహాబూబాబాద్: మహాబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, లేనట్లయితే రైతు పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

రైతు పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, ప్రభుత్వ మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల, వ్యవసాయ రంగం పై అవగాహన లేని వారు రాష్ట్రంలో బీజేపీ కి అధ్యక్షుడు కావడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఉద్యమాలు ద్వారా నే బీజేపీ మెడలు వంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Next Story