- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాశరథి సేవలు మరువలేనివి.. నివాళులర్పించిన మంత్రి సత్యవతి రాథోడ్
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, వారి కన్నీళ్ళను అగ్నిధారగా మలిచి తెలంగాణ ఉద్యమాన్ని రగిల్చిన గొప్ప కవి దాశరథి అని మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. ఆయన మహబూబాబాద్ జిల్లా వాసి కావడం తమకెంతో గర్వకారణంగా ఉన్నదన్నారు. దాశరథి వర్ధంతి సందర్భంగా ఆమె శుక్రవారం హైదరాబాద్ లో నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దాశరథి సాహిత్య రంగంలో చేసిన సేవలు మరువలేని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువెళ్లేలా చైతన్యం కలిగించారన్నారు.’నా కోటి […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, వారి కన్నీళ్ళను అగ్నిధారగా మలిచి తెలంగాణ ఉద్యమాన్ని రగిల్చిన గొప్ప కవి దాశరథి అని మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. ఆయన మహబూబాబాద్ జిల్లా వాసి కావడం తమకెంతో గర్వకారణంగా ఉన్నదన్నారు. దాశరథి వర్ధంతి సందర్భంగా ఆమె శుక్రవారం హైదరాబాద్ లో నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దాశరథి సాహిత్య రంగంలో చేసిన సేవలు మరువలేని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువెళ్లేలా చైతన్యం కలిగించారన్నారు.’నా కోటి తెలంగాణ రతనాల వీణ అని’ సగర్వంగాప్రకటించి, తెలంగాణలోని ప్రతి పల్లెని ఉద్యమంలో భాగస్వామ్యంచేశారని పేర్కొన్నారు. ఆయన స్పూర్తితోనే స్వరాష్టం ఏర్పడిందని, అందుకే ఆయనను ఉద్యమ కవిగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరిట ప్రతీ ఏడాది అవార్డులను అందిస్తున్నదన్నారు.
Next Story






