తిరుపతిలో మంత్రి.. కేసీఆర్‌ దేవుడితో కొట్లాడుతారు అంటూ కామెంట్లు

by  |
తిరుపతిలో మంత్రి.. కేసీఆర్‌ దేవుడితో కొట్లాడుతారు అంటూ కామెంట్లు
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని సత్యవతి రాథోడ్ వెల్లడించారు. కేంద్రం సకాలంలో స్పందించకపోవడంతో ఈ విషయం కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. మిగులు జలాలను వినియోగించుకోవాలని ఏపీ సీఎం దృష్టికి తీసుకొచ్చినా స్పందించలేదన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలిగితే దేవుడితోనైనా పోరాటం చేస్తారని చెప్పుకొచ్చారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి సత్యవతి రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు.

Next Story