నీట మునిగిన కాలనీలు పరిశీలించిన మంత్రి

by  |
నీట మునిగిన కాలనీలు పరిశీలించిన మంత్రి
X

దిశ ప్రతినిధి, వరంగల్: ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన కాలనీలను మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. వరంగల్ జిల్లాలోని అమరావతి నగర్‎లో నాలాను మంత్రి పరిశీలించారు. అనంతరం సంతోషి మాత గార్డెన్‎లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న ప్రజలతో మాట్లాడి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట మేయర్ ప్రకాశ్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ పమేలా‌ సత్పతి ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ క్రింద రూ.50కోట్లు ప్రత్యేకంగా రూ.25 కోట్లు మంజూరుకు అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆ ప్రాంతాలు నీట మునగకుండా శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. ఈ మేరకు పూర్తి ప్రణాళిక తయారు చేస్తున్నట్లు‌ తెలిపారు.


Next Story