ఏమైందీ..? ఫాస్ట్‌గా చేయండి: సబితా

by  |
ఏమైందీ..? ఫాస్ట్‌గా చేయండి: సబితా
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: మిషన్ భగీరథ పథకం కింద చేపట్టిన పనులు తక్షణమే పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని మిషన్ భగీరథ పనులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే, అధికారులతో లక్డికాపూల్లోని రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… రంగారెడ్డిలో 1062 ఆవాసాలకు, వికారాబాద్లో 1062 ఆవాసాలకు తాగునీరు సరఫరా చేయాలని జిల్లా అధికారులు ప్రణాళికలు రూపోందించారని తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 90 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేసి నీరు సరఫరా చేయాలన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని ఆలోచనను సీఎం కేసీఆర్ ఆచరణలో చేశారని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story