- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, రంగారెడ్డి: వర్షాకాలం సమీపిస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన ‘ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ అనే కార్యక్రమంలో భాగంగా మంత్రి సబితా తన నివాసంలోని పూల కుండీలను శుభ్రం చేశారు. ఇంటి అవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి సూచించారు. దీనిని ఓ సామాజిక కార్యక్రమంగా భావించేలా ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో పురపాలకశాఖ ఇప్పటికే ఒక ప్రత్యేక క్యాలెండర్ రూపొందించిందన్నారు. రానున్న వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు రాకుండా చూడాలని కోరారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారని మంత్రి గుర్తుచేశారు.