బిగ్ బ్రేకింగ్ : విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా భేటీ..

by  |
బిగ్ బ్రేకింగ్ : విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా భేటీ..
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో విద్యార్థులకు ఓ పరీక్షాకాలమనే చెప్పాలి. పరీక్ష కేంద్రాలకు వెళ్లి ఎగ్జామ్స్ రాయడమంటే విద్యార్థులకు ఇప్పుడు నిజంగా కత్తిమీద సాములాంటిదేనని చెప్పాలి. ఇప్పటికే ఆన్లైన్ క్లాస్ లు అర్ధంకాక సతమతమవుతున్న విద్యార్థులు కరోనా ఉదృతి అధికంగా ఉన్న నేపథ్యంలో పరీక్షలకు ఎలా హాజరుకావాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై నేడు విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఇటీవలే సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు, 12వ తరగతి పరీక్షలు పోస్టుపోన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అలాగే చేస్తారనే ఆలోచనలో ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. తెలంగాణ ప్రభుత్వం కూడా పరీక్షలు రద్దు చేస్తుందా లేక పోస్టుపోన్ చేస్తుందా అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.



Next Story