- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ భయం నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించిందని వస్తున్న వార్తలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కొట్టిపారేశారు. ఇలాంటి పుకార్లను నమ్మి తల్లిదండ్రులు అయోమయం చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని మంత్రి మండలి సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కరోనా నిబంధనలను అనుసరించాలని మరోసారి ఆదేశించారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని పిలుపునిచ్చారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఆదేశించారు. సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దు.@TelanganaCMO @KTRTRS
— SabithaReddy (@SabithaindraTRS) November 30, 2021
- Tags
- corona