సిరివెన్నెల మృతి పట్ల మంత్రి పువ్వాడ దిగ్భ్రాంతి

by  |
puvvada-1
X

దిశ, ఖమ్మం: సినీ పాటల దిగ్గజం, కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సిరివెన్నెల మృతి పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘తొలి చిత్రం'సిరివెన్నెల'నే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. మూడున్నర దశాబ్ధాల సినీ జీవితంలో మూడు వేలకుపైగా పాటలు రాసిన సిరివెన్నెల విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం అంటూ తొలి పాట రాసి యావత్ తెలుగు హృదయాల్లో, చిత్ర పరిశ్రమలో సముచిత స్థానం పదిలం చేసుకున్నారు’ అని మంత్రి అన్నారు. అనంతరం సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



Next Story

Most Viewed