ప్రభుత్వాస్పత్రిలో అదనపు కలెక్టర్‌కు ప్రసవం.. అభినందించిన మంత్రి

by Sridhar Babu |

<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రసవం చేయంచుకున్న అదనపు కలెక్టర్ స్నేహలతను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. ఆదివారం ఆసుపత్రికి వెళ్లి స్నేహలతను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ చిన్నారిని ఎత్తుకుని కాసేపు లాలించారు. సామాన్యుల మాదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సేవలు పొంది, ప్రభుత్వ ఆస్పత్రులపై మరింత నమ్మకం పెంచారని, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. పేదల గుడి అయిన ప్రభుత్వ ఆసుపత్రులను రాష్ట్ర [&hellip;]</p>

Minister puvvada Ajay
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రసవం చేయంచుకున్న అదనపు కలెక్టర్ స్నేహలతను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. ఆదివారం ఆసుపత్రికి వెళ్లి స్నేహలతను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ చిన్నారిని ఎత్తుకుని కాసేపు లాలించారు. సామాన్యుల మాదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సేవలు పొంది, ప్రభుత్వ ఆస్పత్రులపై మరింత నమ్మకం పెంచారని, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. పేదల గుడి అయిన ప్రభుత్వ ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దారని అన్నారు. మంత్రి అదనపు కలెక్టర్ స్నేహలత భర్త అయిన మణుగురు ASP శబరిస్, మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత, AMC చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, DM&HO మాలతి, సూడా చైర్మన్ విజయ్, వైద్యులు తదితరులు ఉన్నారు.

Next Story