నన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు: పువ్వాడ

by  |
నన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు: పువ్వాడ
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున చురుకుగా ఉండడంతో బీజేపీ కార్యకర్తలు తనను హత్య చేసేందుకు ప్లాన్ చేశారని మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో బాచుప‌ల్లిలో మంత్రి డబ్బులు పంచుతున్నారని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు, కార్యకర్తలు మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్‌పై దాడి చేశారు. అయితే, ఇదే వ్యవహారంపై ఖమ్మంలో ప్రెస్‌మీట్ పెట్టిన పువ్వాడ.. బీజేపీ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదన్నారు. అదృష్టవశాత్తు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తతతో ఆ దాడి నుంచి తప్పించుకున్నానని చెప్పారు. కావాలనే తనపై దాడి చేశారని మంత్రి వివరణ ఇచ్చారు.

సీపీఐ నారాయణపై ఫైర్..
ఇక ఇదే వ్యవహారంపై బర్త్ రఫ్ చేయాలని సీపీఐ నారాయణ డిమాండ్‌ చేయడాన్ని మంత్రి పువ్వాడ ఖండించారు. నారాయణ అర్థంలేని వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బర్త్‌రఫ్ చేయడానికి తానేమి బంట్రోతును కాదని.. కేబినెట్ మినిస్టర్‌ను అంటూ కౌంటర్ ఇచ్చారు. తాను డబ్బులు పంచినట్టు ఆరోపించిన వారందరూ నిరూపించాలని మంత్రి పువ్వాడ అజయ్ సవాల్ విసిరారు.


Next Story