పునరావాస కేంద్రాలలో పువ్వాడ పరిశీలన

by  |
పునరావాస కేంద్రాలలో పువ్వాడ పరిశీలన
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ప‌ట్ట‌ణానికి ఆనుకుని ఉన్న మున్నేరు ప్రవహ ఉధృతిని ఆదివారం మంత్రి అజ‌య్‌కుమార్ ప‌రిశీలించారు. అనంత‌రం కాల్వఒడ్డు పరివాహక ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ముంపు బాధితుల‌కు నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో బ‌స‌ ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంత నిర్వాసితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు.

అనంతరం మున్నేరు ఉధృతిని పరిశీలించారు. మున్నేరు ప్రవహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేలా నోట్ తయారు చేయాలని మున్సిపల్ కమిషన్ అనురాగ్ జయంతికి సూచించారు. ఖమ్మం జిల్లాలో చెరువులు, కాలువలు పొంగి ప్రహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కర్ణన్‌ను ఆదేశించారు.


Next Story

Most Viewed