సాగు పెరిగింది.. ఎరువులు పంపండి

by  |
సాగు పెరిగింది.. ఎరువులు పంపండి
X

దిశ న్యూస్‌బ్యూరో: వర్షాలు సకాలంలో రావడంతో తెలంగాణలోసాగు విస్తీర్ణం పెరిగిందని, దీనికి అనుగుణంగా యూరియా, ఎరువులను కేటాయించాలని కేంద్రమంత్రి సదానంద గౌడను కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఒకరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం కృషిభవన్‌లో సదానందగౌడను కలిసిన నిరంజన్‌రెడ్డి రాష్ట్రంలో సాగు పరిస్థితులను వివరించారు. తెలంగాణకు కేటాయించిన 1.77 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను త్వరగా సరఫరా చేయాలని కోరారు. ఎరువుల గురించి సీఎం కేసీఆర్ ఇప్పటికే మాట్లాడారని, ఈసారి 10.5 లక్షల టన్నుల ఎరువులను తెలంగాణకు ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.



Next Story

Most Viewed