- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: రైతుబంధు నిధులు ఖాతాలో జమకాకపోయినా, బ్యాంకులు నిలిపేసినా ఏఈఓలను సంప్రదించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రైతులకు సూచించారు. ఖాతాల వివరాలు సమర్పించిన రైతులకు వారి వారి ఖాతాలలో నిధులు జమ చేయబడతాయని తెలిపారు. రైతుబంధు నిధులను బ్యాంకర్లు పాతబాకీల కింద జమ చేసుకోవద్దని బ్యాంకర్లను ఆదేశించారు. బకాయిల కింద జమ చేసుకున్న బ్యాంకులు తిరిగి వెంటనే రైతులకు అందజేయాలని తెలిపారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి రైతుబంధు నిధులు జమ చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చామని తెలిపారు. రైతుబంధుకు అర్హులైన వారందిరికీ ఖాతాల్లో నిధులు జమచేయడం జరిగిందనిచెప్పారు. మొత్తం 147.2 లక్షల ఎకరాలకు చెందిన 60.84 లక్షల మంది రైతులకు రూ.7,360.41 కోట్లు ఖాతాలలో జమచేశామని తెలిపారు.
Next Story