ప్రభుత్వానికి ప్రజలకు ‘దిశ’ వారధి: నిరంజన్‌రెడ్డి

by  |
ప్రభుత్వానికి ప్రజలకు ‘దిశ’ వారధి: నిరంజన్‌రెడ్డి
X

దిశ, బెల్లంపల్లి : దిశ పేపర్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. దిశ 2021 క్యాలెండర్ ను మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. దినదినాభివృద్ధి చెందుతూ అతనికాలంలోనే ముందువరుసలో ఉన్న దినపత్రికలకు ‘దిశ’ పోటీగా నిలవడం విశేషమని తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను నిర్భయంగా ప్రచురించేందుకు యాజమాన్యం, కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ కథనాలు.. వాస్తవాలను వెలువరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారించేవిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్ తుమ్మల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed