కరోనాపై అవగాహన కార్యక్రమం

by Shyam |

<p>దిశ, మహబూబ్‎నగర్: కొల్లాపూర్‎లో కరోనా వ్యాధి వ్యాప్తి నియంత్రణపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. లాక్ డౌన్ అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య అని ప్రభుత్వం అంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంది అంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవాలని వారు తెలిపారు. మనం బ్రతకడానికి, తోటివారికి బ్రతికే అవకాశం ఇవ్వడానికి ఈ కరోనా వైరస్ అంతమయ్యే వరకు స్వీయ నిర్బంధం అందరు తప్పకుండా పాటించాల్సిందే [&hellip;]</p>

కరోనాపై అవగాహన కార్యక్రమం
X

దిశ, మహబూబ్‎నగర్: కొల్లాపూర్‎లో కరోనా వ్యాధి వ్యాప్తి నియంత్రణపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. లాక్ డౌన్ అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య అని ప్రభుత్వం అంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంది అంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవాలని వారు తెలిపారు. మనం బ్రతకడానికి, తోటివారికి బ్రతికే అవకాశం ఇవ్వడానికి ఈ కరోనా వైరస్ అంతమయ్యే వరకు స్వీయ నిర్బంధం అందరు తప్పకుండా పాటించాల్సిందే అన్నారు. ముఖ్యంగా సామాజిక దూరంతోనే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలమని, ప్రజలందరూ అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించారు. కుటుంబానికి ఒక్కరూ మాత్రమే బయటకు రావాలని, నిర్దేశించిన సమయంలోనే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు.

Next Story