మంత్రి సంచలన వ్యాఖ్యలు.. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని

by  |
మంత్రి సంచలన వ్యాఖ్యలు.. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని
X

దిశ, ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని చెప్పుకొచ్చారు. పులివెందుల, విజయవాడ ఇప్పుడు రాజధాని కావచ్చు. రేపు మరో ప్రాంతం రాజధాని కావచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం నివాసం ఎక్కడ ఉంటే అదే రాజధాని.. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నాం. రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదంటూ మేకపాటి గౌతంరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మూడు రాజధానులకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గౌతమ్‌రెడ్డి అన్నారు.

Next Story

Most Viewed