రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదు.. మంత్రి కీలక వ్యాఖ్యలు

by  |
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదు.. మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్సిజన్ కొరత లేదని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఏపీలో తయారయ్యే ఆక్సిజన్ విషయంలో రాష్ట్రానికే తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తామన్నారు. మెడికల్ ఆక్సిజన్ సప్లైపై క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం నిఘా ఉందన్నారు. ప్రస్తుతం ఏపీలో 40 రకాల పరిశ్రమల ద్వారా 510 యాంటీ మెడికల్ ఆక్సిజన్ తయారీ జరుగుతోందన్నారు. రోజూ 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు యుద్ద ప్రాతిపదికన ఆక్సిజన్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.


Next Story