కబడ్డీ కబడ్డీ అంటూనే.. కాలు జారి పడ్డ మంత్రి

by  |
కబడ్డీ కబడ్డీ అంటూనే.. కాలు జారి పడ్డ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి చామకూర మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్‌లో 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా, పురుషుల కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కాసాని జ్ఞానేశ్వర్, తదితరులు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఇక క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు మంత్రి మల్లారెడ్డి కబడ్డీ కోర్టులోకి వచ్చారు. అంతేకాదు, కబడ్డీ కబడ్డీ అంటూ కూతకొచ్చారు. ఇదే సమయంలో ఒక్కసారిగా కాలు గాల్లోకి లేపి పాయింట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ, అది కాస్తా విఫలం అవ్వడమే కాకుండా కాలు జారీ కిందపడిపోయారు. వెంటనే చుట్టుపక్కల ఉన్నవారు ఆయన్ని పైకి లేపారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.

Next Story

Most Viewed