ఆరోగ్యంగా ఉండాలంటే నడవాల్సిందే.. మల్లారెడ్డి హెల్త్ టిప్స్

by  |
Minister Malla Reddy
X

దిశ, కంటోన్మెంట్: కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి మర్డపోర్డ్ హాకీ గ్రౌండ్‌లో అజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మారథాన్ 4k రన్‌ను రాష్ట్ర కార్మిక శాఖామంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నడక వల్ల అనేక రోగాలు దూరమవుతాయని అన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సాయన్న, మేజర్ జనరల్ ప్రీత్ పాల్ సింగ్, సీఈఓ అజిత్ రెడ్డి, మాజీ బోర్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Minister Malla Reddy

Minister Malla Reddy



Next Story

Most Viewed