గోవులను బలి ఇవ్వొద్దు

by  |
గోవులను బలి ఇవ్వొద్దు
X

దిశ, క్రైమ్‌బ్యూరో: బక్రీద్ పండగ రోజు గోవులను బలి ఇవ్వొద్దని హోంమంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని పోలీసుశాఖ తీసుకోవాల్సిన చర్యలపై శనివారం ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా పరస్పరం గౌరవించుకుంటామని తెలిపారు. అదే తరహాలో బక్రీద్ పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. చార్మినార్‌లోని నాలుగు మినార్లు హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్లుగా భావిస్తామని ఈ విధంగా అన్ని మతాలను, కులాలను సమానంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

హిందూవులు గోవులను పూజిస్తున్నందున ఎప్పటిలాగే వాటిని బలి ఇవ్వొద్దని కోరారు. ఈ సమయంలో పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని హోంమంత్రి కోరారు. ప్రార్థనలు, జంతువుల అమ్మకం, కొనుగోలు సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సురక్షితమైన చర్యలతో పాటు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని హోంమంత్రి తెలిపారు.


Next Story

Most Viewed