కంటోన్మెంట్ విలీనంపై మంత్రి కేటీఆర్ రియాక్ట్.. మీరెంమంటారంటూ..

by  |
ktr twitter
X

దిశ, డైనమిక్ బ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు‌ని తీసుకురావాలని గత కొన్నేళ్లుగా నగర ప్రజల నుంచి డిమాండ్ ఉంది. కంటోన్మెంట్ ప్రాంతమంతా ఆర్మీ అధికారుల ఆధీనంలో ఉంటుంది. అయితే, ఏవోసీ ప్రాంతాన్ని కొన్ని సమయాల్లో రాత్రిళ్లు అనుమతించరు. ఈ క్రమంలో అక్కడి నుంచి వచ్చిపోయే వారికి తీవ్రంగా ఇబ్బంది నెలకొంటుంది. అయితే కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి వచ్చిన వినతులతో కేటీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. నగరవాసులు కోరినట్లే.. విలీనానికి తాను ఏకీభవిస్తున్నాని తెలిపారు. మరి మీరేమంటారంటూ ప్రశ్నించి నెటిజన్ల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.



Next Story

Most Viewed