- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సిరిసిల్ల : అభివృద్ఢి పథంలో దూసుకుపోతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. కార్మిక, ధార్మిక, కర్షకుల నిలయం రాజన్న జిల్లా అని కొనియాడారు. ఏడేళ్లలో ఎన్నో అద్భుతాలు జరిగాయని, రాష్ట్రానికే జంక్షన్లా జిల్లా నిలిచిందన్నారు. ఇక్కడ చేపట్టిన వివిధ ప్రాజెక్టుల కారణంగా ఆరు మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని, యువ ఐఏఎస్లకు పాఠ్యాంశగా చేర్చారని కేటీఆర్ అన్నారు. అప్పర్ మానేరుతో నాయనమ్మ ఇళ్లు, మిడ్ మానేరుతో మా అమ్మమ్మ ఇళ్లు మునిగిపోయిందని కేటీఆర్ వివరించారు.
మానేరు నదిపై 11 చెక్ డ్యాంలను, మూల వాగుపై 13 చెక్ డ్యాంలను ఏర్పాటు చేశారని, మరో 12 చెక్ డ్యాంలను మంజూరు చేయాలని కేటీఆర్ కోరారు. అప్పర్ మానేరు 75 ఏళ్ల క్రితం నిర్మించారని ఈ ప్రాజెక్టు ఆధునీకీకరణ చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కేటీఆర్ కోరారు. వేములవాడ ఆలయ అభివృద్ది కోసం ప్రత్యేక దృష్టి సారించాలని, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, అనంతగిరి రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కేటీఆర్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కాలేజీతో పాటు, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేయాలని కేటీఆర్ ముఖ్యమంత్రిని కోరారు.