ఎలివేటేడ్​ కారిడార్​కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

by  |
ఎలివేటేడ్​ కారిడార్​కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
X

దిశ, న్యూస్​బ్యూరో: రూ. 523 కోట్ల 37 ల‌క్షల వ్యయంతో న‌ల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వ‌ర‌కు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్‌కు గురువారం మంత్రి కేటీఆర్​ శంకుస్థాప‌న చేశారు. 3.82 కిలోమీట‌ర్ల ఈ ఎలివేటెడ్ కారిడార్‌లో 2.58 కిలోమీట‌ర్ల పొడ‌వున ఫ్లైఓవ‌ర్ తో పాటు రెండు వైపులా ర్యాంప్ నిర్మాణం చేపడుతున్నారు. నాలుగు లేన్లతో నిర్మిస్తున్న ఈ కారిడార్‌తో న‌ల్గొండ క్రాస్ రోడ్ నుంచి సైదాబాద్‌, ఐఎస్ స‌ద‌న్‌, ఓవైసీ జంక్షన్ల మ‌ధ్య ట్రాఫిక్ ర‌ద్దీ స‌మ‌స్య ప‌రిష్కరమవుతుందని జీహెచ్​ఎంసీ అధికారులు వివరించారు. ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను తీర్చిదిద్దేందుకు చేప‌ట్టిన ప‌నుల్లో భాగంగా ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని ఆధునిక టెక్నాల‌జితో చేప‌డుతున్నారు. శంకుస్థాపన అనంతరం కేటీఆర్​ మాట్లాడకుండానే కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో హోం మంత్రి మ‌హ్మద్ అలీ, ప‌శుసంవ‌ర్థక శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ, స్థానిక కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed