బండి సంజయ్ చిల్లర మాటలు మాట్లాడకు : కేటీఆర్

by  |
బండి సంజయ్ చిల్లర మాటలు మాట్లాడకు : కేటీఆర్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఫైర్ అయ్యారు. కరీంనగర్ ఎంపీ గా గెలిచి కరీంనగర్ కు ప్రత్యేకంగా ఒక్క పైసా అయినా తీసుకొచ్చావా అని ప్రశ్నించారు. దమ్ముంటే అభివృద్ధిలో మాతో పోటీ పడాలని సవాల్ విసిరారు. చేతనైతే కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా తీసుకుని రావాలని సంజయ్‌ను డిమాండ్ చేశారు.

చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు ఊరుకోరన్న విషయం గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని హితవు పలికారు. నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ గెలుస్తోందని, బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతవుతందని స్పష్టం చేశారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌లతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేటీఆర్ జోస్యం చెప్పారు.

Next Story

Most Viewed