- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: సెప్టెంబర్ 2వ తేదీన జరిగే టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు నిచ్చారు. గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేసి.. అనేక కార్యక్రమాలను ప్రారంభించాలని కోరారు. బుధవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ర్ట కార్యవర్గం, పార్టీ సర్పంచులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పార్టీ సంస్థగత నిర్మాణంపైన దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 2వ తేదీన జరిగే పార్టీ జెండా పండుగ కార్యక్రమానికి గ్రామ, వార్డుల పరిధిలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ వచ్చేలా సమాచారం అందించి సమన్వయం చేసుకోవాలన్నారు. అదే రోజు ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సీఎం కేసీఆర్ చేస్తున్న శంఖుస్థాపనకు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు హాజరవుతున్న నేపథ్యంలో స్థానిక నాయకత్వం ఈ జెండా పండుగ విజయవంతానికి కృషి చేయాలన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు, సీనియర్ నాయకులు సమన్వయం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.