బల్దియాపై కేటీఆర్ సీరియస్

by  |
బల్దియాపై కేటీఆర్ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ల మీద పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. రోడ్ల మీద రోజుల తరబడి చెత్త పెరుకుపోవడంతో ఇటీవల ట్విట్టర్ ద్వారా అనేక సార్లు కేటీఆర్ కి నగర ప్రజలు ఫిర్యాదులు చేశారు. టాయిలెట్స్ తీరు పై కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్స్ మెయింటైన్ చేయకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయింటైన్ చేసిన వారికి వెంటనే బిల్స్ చెలించి,వాటి మీద ఫోకస్ చెయ్యాలని ఆదేశించారు.


Next Story

Most Viewed