పిచ్చోడు సర్జికల్ స్ట్రైక్ అంటున్నాడు

by  |
పిచ్చోడు సర్జికల్ స్ట్రైక్ అంటున్నాడు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో శుక్రవారం ఆర్యవైశ్యుల ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ… రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారో ఆలోచించాలని తెలిపారు. అభివృద్ధి చేస్తున్న పార్టీకి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. వైశ్య కార్పొరేషన్, రిజర్వేషన్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో కలిసి, మెలిసి బతుకుతున్నామని అన్నారు. తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని గుర్తుచేశారు. ‘సర్జికల్ స్ట్రైక్ అని ఒక పిచ్చోడు అంటాడు.. సమాధులు కూలుస్తామని మరొక పిచ్చోడు అంటాడు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed